లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2026 -2027ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు గుడ్న్యూస్ చెప్పారు. దేశంలో మెుత్తం 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా.. అందులో హైదరాబాద్కు 3 ఉండటం విశేషం. హైదరాబాద్- బెంగళూరు, పుణె- హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై మధ్య హైస్పీడ్ ట్రైన్ కారిడార్లు నిర్మంచనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.