తెలంగాణకు కేంద్రం మరో భారీ శుభవార్త చెప్పింది. రూ.వెయ్యి కోట్లతో భారీ రైల్వే ప్రాజెక్టును ప్రకటించింది. గూడ్స్ రైలు వ్యాగన్లను రిపేర్ చేసే మెగా ఫ్రైట్ ఎగ్జామినేషన్ స్టేషన్ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్రంలోనే తొలి స్టేషన్ కావడం గమనార్హం. ఈ రిపేర్ స్టేషన్లో.. రైలు వ్యాగన్ను పూర్తిగా విడదీసి.. ప్రతీ భాగాన్ని చెక్ చేసి.. మళ్లీ కొత్త వ్యాగన్ల లాగా బిగించనున్నారు. ఇందుకోసం వరంగల్ జిల్లాలో భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.