Telangana new Chief Secretary: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన రానున్న ఆగస్టులో రిటైర్ కానున్నారు. 1990 బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత కీలక భాద్యతలు నిర్వహించారు. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈనెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆమె రిటైర్మెంట్ అనంతరం సీఎస్గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు.