తెలంగాణలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. శుక్రవారం పెద్దపల్లి జిల్లా అకెనపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, రాత్రిపూట కూడా వేడి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఈనెల 28 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.