ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి, తుఫాన్గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.