ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుందని తెలిపారు. ఇక కేసీఆర్పై తనకు కక్ష సాధింపు లేదని.. కేసీఆర్ను జైలుకు పంపించాలంటే రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పదిన్నరేళ్లపాటు తానే తెలంగాణకు సీఎంను అని పేర్కొన్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ- కార్ రేసు కేసుల్లో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.