రుతుపవనాల రాకతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నైరుతి రుతు పవనాల ప్రభావంతో.. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వానలు పడతాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.