తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ, మరఠ్వాడ ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.