తెలంగాణలో గత పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు నేడు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రానున్న మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.