హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలంగాణకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు. పలు జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎలర్ట్ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని వర్షం కురిసే సమయంలో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు.