తెలుగు రాష్ట్రాల్లో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా సరకు రవాణా సామర్థ్యం పెంచేందుకు రూ.1,361 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.908 కోట్లతో మహబూబాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు కానుంది. ఇది రైళ్ల నిర్వహణను వేగవంతం చేసి, ఉపాధి అవకాశాలను పెంచుతుంది.