తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వానలు పడనున్నట్లు తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే 3 రోజుల తర్వాత ఎండలు మండిపోనున్నట్లు వెల్లడించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదు కానున్నట్లు స్పష్టం చేసింది.