తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 7 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.