తెలంగాణలో గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. భారత వాతావరణ శాఖ మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.