వాయవ్య బంగాళాఖాతం నుంచి అల్పపీడన ద్రోణి విస్తరించిన నేపథ్యంలో తెలంగాణలో నేడు, రేపు (సోమ, మంగళవారాల్లో) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురవగా.. ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎంతో ఊరటనిస్తున్నాయి.