రెండు తెలుగు రాష్ట్రాలను మొంథా తుఫాన్ వణికిస్తోంది. ఇక తీరం దాటిన తర్వాత మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణపై భారీగానే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 3 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు పడుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.