నిన్నటి దాకాా ఏపీని వణింకించిన మొంథా తుఫాను.. ఇప్పుడు తెలంగాణపై ఓ రేంజ్లో విరుచుకుపడుతోంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడిన తుఫాను.. మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది..