తెలంగాణలో హామీల అమలుపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మితిమీరిన అప్పులే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు కారణమన్నారు. తులం బంగారం, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేయలేకపోవడానికి కారణం గత ప్రభుత్వం చేసిన అప్పులే అని వివరించారు. వడ్డీల రూపంలోనే ప్రతి ఏడాది రూ.75,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ.. తాము ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామన్నారు.