18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతీ రైతు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రైతు పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి.. దీంతో పాటు.. ఆధార్ కార్డు ఉంటే ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వీటికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా..ఆగస్టు 13 చివరి తేదీగా ఉంది. ఇంకా దరఖాస్తు చేయని వారు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. ఈ పథకం ద్వారా రైతు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం కింద అందజేస్తారు.