తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. అయితే రానున్న 3 రోజుల్లో మరింతగా భానుడి భగభగలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 3 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.