తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పరిపాలనలో కీలక మార్పు జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వుల మేరకు.. ప్రభుత్వం ఏకంగా 32 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా.. ఏడీజీ (పర్సనల్)గా చౌహాన్, సీఐడీ డీఐజీగా పరిమిళా నూతన్, తెలంగాణ నార్కొటిక్ ఎస్పీగా పద్మ నియమితులయ్యారు. అదేవిధంగా.. నాగర్కర్నూలు, మహబూబాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, ములుగు వంటి జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్ను నియమించారు.