రాష్ట్ర కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో 32 శాతంగా ఉన్న రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాలు మొత్తం భూముల్లో 51.4 శాతాన్ని కలిగి ఉన్నాయి. 4.8 శాతం జనాభా కలిగిన రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా 13.5 శాతం భూమితో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఎస్సీ మాదిగ వంటి సామాజిక వర్గాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లు సర్వే తేల్చింది.