తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.