అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద హైదరాబాద్లోని ఉందానగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ. 12.37 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 79 శాతం పనులు పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. స్టేషన్ భవనం విస్తరణ, వెయిటింగ్ హాల్, పే అండ్ యూజ్ టాయిలెట్స్ వంటి నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ స్టేషన్ హైదరాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.