తెలంగాణలో విమానయాన రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు హైదరాబాద్లో మాత్రమే ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రజల విమాన అవసరాలను తీర్చుతుంది. అయితే.. తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా భూసేకరణ కొరకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసింది. అంతే కాకుండా.. భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.1.20 కోట్లు పరిహారం చెల్లించనుంది. చారిత్రాత్మక మామునూరు ఎయిర్స్ట్రిప్ను ఆధునిక విమానాశ్రయంగా అభివృద్ధి చేయనున్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్లో కూడా విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.