తెలంగాణలోని ట్రైన్ ప్రయాణికులకు గుడ్న్యూస్. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ఆరు ట్రైన్ లైన్లు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు డీపీఆర్ తయారీకి సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే సర్వే పనులు పూర్తవుతాయని వెల్లడించారు.