తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలను దాటి, ప్రస్తుతం సాగర్ ద్వీపానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.