తెలంగాణ ప్రజలు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో గజ గజ వణుకుతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. తాజాగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రెండు రోజులు అనగా శని, ఆది వారాలు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దట్టమైన పొగమంచుతో రోడ్ల మీద ప్రయాణించే వారు ఇబ్బంది పడుతున్నారు. ఆ వివరాలు..