గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆరోపించారు. తాము సియోల్ నుంచి హైదరాబాద్ వెళ్లేలోపు ఒకటో రెండో బాంబులు దీపావళి టపాసుల్లో పేలుతాయన్నారు. అందులో పెద్ద నాయకులే ఉంటారన్నారు. వారిని అరెస్టు చేయాలా.. ? జీవితకాలం జైలులో ఉంచాల్నా అనేది చట్టం నిర్ణయిస్తుందన్నారు.