2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి సమీక్షించారు. నక్షా మ్యాప్లు లేని 373 గ్రామాల్లో అత్యాధునిక రోవర్లతో రీ-సర్వే చేపట్టాలని, రెవెన్యూ సేవల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని నిర్ణయించారు. మూడేళ్లలో అన్ని గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. అలాగే అంగన్వాడీల ఆధునీకరణ, స్కిల్స్ యూనివర్సిటీతో ఉపాధి కోర్సుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.