Telangana Govt 79 New Dialysis Centres: తెలంగాణలో కిడ్నీ బాధితులకు ఊరట దక్కనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 79 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డయాలసిస్ సెంటర్ల ద్వారా అదనంగా 416 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న 67 పాత సెంటర్లలో కొత్తగా 155 మెషీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక సెంటర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.