మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయారు. నాలుగు బస్సులలో కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న మావోయిస్టులు.. సీఎం రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోయారు. 31 ఏకే 47 తుపాకులు, 124 ఆయుధాలు సరెండర్ చేశారు. దేవ్జీకి చెందిన PLGA దళం మొత్తం లొంగిపోయినట్లు తెలిసింది.