తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 21 అడుగులకు చేరగా.. పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం మునిగిపోయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ములుగులోని వెంకటాపురంలో బుధవారం 46.9 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. అనేక జిల్లాల్లో వాగులు పొంగి, రోడ్లు తెగిపోయి, పొలాలు నీటమునిగాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.