తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, గతరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని రహదారులు జలమయమయ్యాయి.