తెలంగాణలో ఆగస్టు నెలలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న గంటల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.