తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు-భవనాల శాఖ 'విజన్-2047'తో భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2047 నాటికి 53,102 కి.మీ. రహదారులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్, పలు జాతీయ రహదారుల విస్తరణ, కొత్త వంతెనల నిర్మాణంపై దృష్టి సారించారు. రూ.70,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆశిస్తున్నారు.