తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి భూసేకరణలో జాప్యం, నిధుల వాటా చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకపోవడమే కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. పలు కీలక ప్రాజెక్టులకు అవసరమైన భూమిలో సగం కంటే ఎక్కువ ఇంకా సేకరించాల్సి ఉందని, రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆలస్యమవుతున్నాయని ఆయన వెల్లడించారు.