వికారాబాద్-కృష్ణా మధ్య కొత్త రైలు మార్గం నిర్మాణానికి ఫీల్డ్ సర్వే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రయాణ దూరం, సమయం తగ్గుతాయన్నారు. డీపీఆర్ తర్వాత తుది ఆమోదం లభించనుందని చెప్పారు. మరోవైపు, విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ వేళలు మారాయి. సంక్రాంతి ప్రత్యేక రైళ్ల సేవలు మరికొన్ని వారాలు పొడిగించారు.