తెలంగాణలో మరో రైల్వేలైన్ అందుబాటులోకి రానుంది. హనమకొండ జిల్లా హసన్పర్తి రోడ్డు నుంచి ధర్మసాగర్ మీదుగా నష్కల్ వరకు ఈ గూడ్సు బైపాస్ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ మేరకు భూసేకరణ చేపట్టాలని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భూసేకరణ తర్వాత త్వరలోనే ప్రాజెక్టు పనులు పట్టాలెక్కనున్నాయి.