మహబూబ్నగర్- డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైళ్ల రాకపోకలు మెరుగుపడటంతో పాటు సరకు రవాణా సామర్థ్యం పెరిగి, దక్షిణ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది.