ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ- కాజీపేట మార్గంలో మూడో లైను నిర్మాణం తుది దశకు చేరుకుంది. 19 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే.. రైళ్ల ఆలస్యం తగ్గి ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరతారు. రద్దీ తగ్గి, గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు వేర్వేరు మార్గాల్లో వెళ్లే వీలు కలుగుతుంది. త్వరలోనే ఈ కొత్త లైను అందుబాటులోకి రానుంది.