దక్షిణ తెలంగాణ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ లైన్కు సంబంధించిన డీపీఆర్ తాజాగా రైల్వే బోర్డుకు చేరింది. ఈ మేరకు అధికారులు కసరత్తు మెుదలు పెట్టారు.