తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. హైటెక్సిటీ, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల ఆధునికీకరణతో పాటు, కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు యాదాద్రి వరకు విస్తరిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కాజీపేటలో మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని.. రైల్వే ప్రాజెక్టుల పురోగతిని కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు.