తెలంగాణలో నాలుగు కీలక నేషనల్ హైవే ప్రాజెక్టులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కొత్త ఆర్థిక సంవత్సరంలోనే నిధులను కేటాయించనుంది. వాటితో పాటు హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు వరుసలుగా విస్తరణ, రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనులు ప్రారంభం కానున్నాయి.