కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సైనిక్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా, సైనిక్ స్కూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దరఖాస్తు చేయాలని రాజ్నాథ్ సింగ్ సూచించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలవాలని సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు.