నిరుద్యోగులకు టీజీపీఎస్సీ భారీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి నెలకో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక నోటిఫికేషన్ విడుదల చేయగా.. త్వరలోనే 2,500 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు.. ఓటీఆర్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. వివిధ రకాల పరీక్షలు క్లాష్ కాకుండా ఉండేందుకు పక్కాగా పరీక్షల షెడ్యూల్ను రూపొందించనుంది.