తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దీనిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరు గ్యారెంటీల్లో ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు కూడా. తాజాగా వినాయక చవితి సందర్భంగా.. గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అందరికీ ఇది వర్తించదని.. ఎవరైతే మండపాలకు పర్మిషన్ తీసుకున్నారో వారికి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.