బనకచర్ల వివాదం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో కోవర్ట్లు ఉన్నారని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాళ్లేనని.. ఆ కోవర్ట్లకు కరెంట్, నల్లా కనెక్షన్లు కట్ చేయాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల డబ్బులు ఇవ్వపోతే.. వాళ్లే చంద్రబాబు వద్దకు వెళ్లి బనకచర్ల బంద్ పెట్టిస్తారన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.