తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం, తెల్లవారుజామున కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రానున్న మూడ్రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.