ఏపీలో నాన్ వెజ్ ప్రియులకు ఉపశమనం కలిగించే వార్త. గత కొన్ని రోజులుగా కొండెక్కిన చికెన్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. మార్చి నెలాఖరులో కిలో రూ.400 వరకూ పలికిన కోడి మాంసం.. ప్రస్తుతం రూ.260 నుంచి రూ.270 వరకూ పలుకుతోంది. చికెన్ రేట్లు రాబోయే రోజులలోనూ మరింత తగ్గవచ్చని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో చికెన్ షాపుల బంద్ కారణంగా ఏపీకి డిమాండ్ కంటే అధికంగా కోళ్ల సరఫరా జరుగుతోందని.. ఫలితంగా చికెన్ రేట్లు తగ్గుతున్నాయని చెప్తున్నారు.